పర్యాటక ప్రాంతంలో పుర్రె కలకలం

8 May, 2019 13:07 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: పర్యాటక ప్రాంతం కైలాసగిరిలో ఓ మనిషి పుర్రె లభించడం కలకలంరేపింది. పుర్రె లభ్యమయిన ప్రాంతానికి 50 అడుగుల దూరంలో కొండపై మొండెం లభ్యమైంది. ఆత్మహత్య చేసుకున్నట్లు మొండెం లభ్యమయిన చోట ఆధారాలుదొరికాయి. ఆత్మహత్య చేసుకుని 20 రోజులు గడిచి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ముందుగా పుర్రె లభ్యం కావడంతో పోలీసులు హత్యగా అనుమానించారు. ఆరిలోవ పోలీసులు గుర్తు తెలియని మృతదేహం ఆధారాలను సేకరించే పనిలోపడ్డారు.

మరిన్ని వార్తలు