రాయచోటి, న్యూస్లైన్: పెద్ద రాష్ట్రాలను ముక్కలు చేసి చిన్నచిన్న రాష్ట్రాలుగా ఏర్పాటు చేయడం వలన ఆర్థిక ఇబ్బందులతో పాటు అభివృద్ది కూడా కుంటుపడుతుందని లక్కిరెడ్డిపల్లె మాజీ ఎమ్మెల్యేలు గడికోట ద్వారకనాథరెడ్డి, గడికోట మోహన్రెడ్డిలు అభిప్రాయపడ్డారు.
రంజాన్ సందర్భంగా పాలన్నగారిపల్లె, ఉడుంవారిపల్లె, చిట్లూరు గ్రామాలలో శుక్రవారం ముస్లిం మైనార్టీలకు వారు శుభా కాంక్షలు తెలిపారు. అనంతరం విలేకరులతో వారు మాట్లాడారు. యూపీఏ ప్రభుత్వం రాష్ట్రాన్ని ముక్కలు చేయడాన్ని ఖండించారు.