కొండచిలువను మింగిన వైరినాగు

2 Nov, 2017 06:28 IST|Sakshi

శ్రీకాకుళం,పాలకొండ రూరల్‌: కొండచిలువను మింగిన వైరినాగు గ్రామస్తుల చేతిలో హతమైంది. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం ఓని గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఓని సమీపంలోని నాగావళి ఎడమ కాలువ వద్ద 16 అడుగుల వైరినాగుపాము ఎనిమిది అడుగుల కొండచిలువను మింగేసింది. దీనిని గమనించిన గ్రామస్తులు భయాందోళనకు గురై ఆ పామును కర్రలతో కొట్టి చంపారు. దీంతో పాము నోట్లో ఉన్న కొండచిలువ కూడా చనిపోయింది.

మరిన్ని వార్తలు