తిరుమలలో పాముల కలకలం

2 Jul, 2016 13:12 IST|Sakshi

తిరుమల : తిరుమల బాలాజీనగర్‌లోని జనావాసాల్లోకి శనివారం పాము ప్రవేశించింది. దీంతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులయ్యారు. ఇళ్లు నుంచి బయటకు పరుగులు తీశారు.  పాము సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అటవీ సిబ్బంది పది అడుగుల పామును పట్టుకొని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి వదిలివేశారు. గత వారం రోజుల్లో జనావాసాల్లోకి పాము రావడం రెండో సారి కాగా.. గత మూడు రోజులుగా ఈ ప్రాంతంలో చిరుతలు సంచరిస్తుండంపై స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు