రైల్వే సమస్యలు పరిష్కరించండి

26 May, 2015 04:43 IST|Sakshi
రైల్వే సమస్యలు పరిష్కరించండి

- దక్షిణ రైల్వే జీఎంకు ఎమ్మెల్యే రోజా వినతి
- తిరుపతి - చెన్నై మధ్య డీజీ రైలు
 పుత్తూరు:
నగరి నియోజకవర్గ పరిధిలోని రైల్వేస్టేషన్లల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆర్కే రోజా కోరారు. ఈ మేరకు సోమవారం ఆమె చెన్నైలోని సదరన్ రైల్వే జీఏం అశోక్‌కుమార్ అగర్వాల్, డీఆర్‌ఎం అనుపం శర్మలకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పలు సమస్యలను వారి దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మె ల్యే పేర్కొన్న ప్రధాన సమస్యలు ఇవీ..
- ప్రధానంగా ఏకాంబర కుప్పం రైల్వే గేటు వద్ద రాకపోకల సందర్భంగా రోడ్డు ఛిద్రమైపోవడంతో తరచూ ఇబ్బందులు  ఏర్పడుతున్నాయి. వెంటనే మరమ్మతులు చేపట్టాలి.
-ప్రయాణికులకు షెల్టర్లు, పైనుంచి దిగే ప్రయాణికులకు వీలుగా మెట్లు ఏర్పాటు చేయాలి. ఇక్కడ చెన్నై- ముంబై ఎక్స్‌ప్రెస్ స్టాపింగ్‌కు చర్యలు తీసుకోవాలి.
- నగరి రైల్వేస్టేషన్‌లో ఉన్న ప్లాట్ ఫాం పెంచాలి.
- సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌తో పాటు చెన్నై నుంచి తిరుత్తణి వరకు వచ్చే యూనిట్ ట్రైన్‌లను తిరుపతి వరకు పొడిగించాలి. -పుత్తూరు రైల్వేస్టేషన్లో రిజర్వేషన్ కౌంటర్ రెండు షిప్టులు పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలి.
- ప్రస్తుతం ఉన్న షెల్టర్లు ప్రయాణికులకు ఏ మాత్రం సరిపోవడంలేదు. కొత్తగా షెల్టర్లు నిర్మించాలి.
- తాగునీటి సౌకర్యంతో పాటు వెయిటింగ్ హాల్‌లో అదనంగా ఫ్యాన్లు ఏర్పాటు చేయాలి.
- పూడి రైల్వేస్టేన్‌లో ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలి. అక్కడ అన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆగే ఏర్పాటుచేయాలి.
- ఎలక్ట్రికల్ సబ్‌స్టేషన్ నుంచి ప్రత్యేకంగా విద్యుత్‌లైన్లు ఏర్పాటుచేసి రైల్వేస్టేషన్‌తో పాటు పక్కనే ఉన్న ఊరికి 24 గంటల విద్యుత్ సౌకర్యం కల్పించాలి.
- పాత రైల్వేస్టేషన్ బిల్డింగ్‌ను వెయింటింగ్ హాల్‌గా మార్చాలి. అలాగే అప్రోచ్‌రోడ్లు వేయాలి.
- వేపగుంట రైల్వేస్టేషన్ వద్ద లిఫ్ట్ గేటు మరమ్మతులు చేపట్టాలి. ప్లాట్‌ఫాం పెం చడంతో పాటు ప్రయాణికులకు తాగునీ టి వసతి, ఇరువైపులా షెల్టర్లు నిర్మిచాలి.
- ఎమ్మెల్యే రోజాతో పాటు తిరుపతి ఎంపీ వరప్రసాద్, నగరి మున్సిపల్ చైర్‌పర్సన్ కెజె.శాంతికుమార్, వైఎస్‌ఆర్‌సీపీ టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెజె.కుమార్, బీసీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలుమలై(అమ్ములు)తో పాటు పుత్తూరు, నగరి నాయకులు రైల్వే ఉన్నతాధికారులను కలిసిన వారిలో ఉన్నారు.
 
తిరుపతి - చెన్నై డీజీ రైలు
తిరుపతి ఎంపీ వరప్రసాద్ మాట్లాడు తూ, తిరుపతి నుంచి పుణ్యక్షేత్రాల మీదుగా షిర్డీకి డీజీ రైలు నడపాలని గతంలో కేంద్ర రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేశామని పేర్కొంటూ, మరికొద్ది రోజు ల్లో ఇది కార్యరూపం దాల్చబోతోందన్నారు. కేంద్రం పచ్చ జెండా ఊపడంతో త్వరలో ఈ రైలు సేవలు అందుబాటులోకి రానున్నాయన్నారు. నాయుడుపేట, గూడూరు, సూళ్లూరుపేట ైరె ల్వే స్టేషన్లలోని సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు వివరించారు.

మరిన్ని వార్తలు