'ఆ ప్రాంత ప్రజలు రగిలిపోతున్నారు'

6 Nov, 2015 17:27 IST|Sakshi
'ఆ ప్రాంత ప్రజలు రగిలిపోతున్నారు'

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు పాలనలో అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకరించడం వల్ల రాయలసీమ, ఉత్తరాంధ్రలో అసహనం పెరిగిపోతోందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య మండిపడ్డారు. అసమానతలపై ఆ ప్రాంత ప్రజలు రగిలి పోతున్నారని తెలిపారు.

ఇప్పటికైనా చంద్రబాబు తన విధానాలను సమీక్షించుకొని ..అభివృద్ధి వికేంద్రీకరణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు