కొత్తపల్లి గీతకు చేదు అనుభవం

3 Nov, 2014 20:05 IST|Sakshi
కొత్తపల్లి గీత(ఫైల్)

విశాఖపట్నం: అరకు ఎంపీ కొత్తపల్లి గీతకు సొంత నియోజకవర్గంలో చేదు అనుభవం ఎదురైంది. నందివలసలో సోమవారం స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆమెను గిరిజనులు నిలదీశారు. హుదూద్ తుపాను వచ్చిన మూడు వారాల తర్వాత అరకులో కనిపించిన ఎంపీని కడిగిపారేశారు.

ఈ మూడు వారాల్లో కనీసం తమను పలకరించడానికి రాని ఎంపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తుపాను సాయం అందలేదని, తమను ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. గిరిజనులు నిలదీయడంతో ఎంపీ అవాక్కయ్యారు.

మరిన్ని వార్తలు