స్పీకర్ కోడెల శివప్రసాదరావు వెల్లడి
తెనాలి: జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం మే నెల 14, 15 తేదీల్లో శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తామని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. బుర్రిపాలెం రోడ్డులో రాజ్యసభ మాజీ సభ్యుడు యడ్లపాటి వెంకట్రావు నివాసానికి శనివారం స్పీకర్ కోడెల, రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనందబాబు వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో కోడెల మాట్లాడారు.