స్పెషల్ బ్రాంచ్ ఎస్‌ఐ ఆత్మహత్య

15 Jan, 2016 03:42 IST|Sakshi
స్పెషల్ బ్రాంచ్ ఎస్‌ఐ ఆత్మహత్య

విజయనగరం క్రైం: విజయనగరంలో స్పెషల్ బ్రాంచ్ ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్న మార్కొండపట్నాయకుని చిన్నికృష్ణారావు(43) ఆత్మహత్యకు పాల్పడ్డారు. రైల్వే పోలీసులు, బంధువుల కథనం ప్రకారం. సీతానగరం మండల కేంద్రానికి చెందిన ఈయన 1993లో పోలీసు కానిస్టేబుల్‌గా చేరి, 2010లో హెచ్‌సీగా, 2014లో ఎస్‌ఐగా పదోన్నతి పొందారు. గురువారం సాయంత్రం ఆరున్నర ప్రాంతంలో రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈయనకు భార్య జ్యోతి, కుమారుడు రాకేష్(17) ఉన్నారు. కుమారుడు  హైదరాబాద్‌లోని ఓ కార్పోరేట్ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఆత్మహత్యకుగల కారణాలు తెలియరాలేదు.

మరిన్ని వార్తలు