ఓటరు నమోదుకు స్పెషల్‌ డ్రైవ్‌

2 Jun, 2017 03:05 IST|Sakshi

విజయనగరం కంటోన్మెంట్‌: ఓటరు నమోదుకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు డీఆర్వో శ్రీలత చెప్పారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆమె గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు 18–21 ఏళ్లలోపు యువతను గుర్తించి ఓటు నమోదు చేసేందుకు జూలై 1 నుంచి 31 వరకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

 కేంద్రస్థాయి నుంచి బీఎల్‌ఓల వరకు అధికారులు ప్రజల ఇంటికి వెళ్లి ఓటర్లను తొలగించడం, కొత్త ఓటర్లను చేర్చడం లాంటి పనులు చేయాలన్నారు. ఈ మేరకు ఈ మధ్య కాలంలో విస్తృత ప్రచారం చేస్తామని తెలిపారు. వివిధ కాలేజ్‌ల ప్రిన్సిపాల్స్‌కు కూడా ఓటరు నమోదుపై ఆదేశాలిచ్చినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎన్నికల సెల్‌ విభాగం పర్యవేక్షకురాలు వైఆర్‌కే వాణి, టీడీపీ తరుపున ఐవిపి రాజు, వైఎస్సార్‌ సీపీ తరపున ఎస్‌వివి రాజేష్, ఎం. అప్పలనాయుడు, బీఎస్పీ తరుపున ఆర్జి శివప్రసాద్, సీపీఎం తరుపున రెడ్డి శంకరరావు తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు