దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు

26 Sep, 2013 01:00 IST|Sakshi

కల్లూరు రూరల్, న్యూస్‌లైన్: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి విడుదల సందర్భంగా పార్టీ కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త మణిగాంధీ, కర్నూలు నగర నాయకుడు పెరుగు పురుషోత్తంరెడ్డి ఆధ్వర్యంలో గార్గేయపురం గ్రామస్తులు సంబరాలు జరుపుకున్నారు. గ్రామంలోని సయ్యద్ జలాలుద్దీన్ బొఖారి(తోకర్‌షావలి) దర్గాలో ఫాతేహాలు ఇచ్చి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దర్గా వద్ద గ్రామస్తులు, అభిమానులకు విందును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పెరుగు పురుషోత్తంరెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి  రాక కోసం జనం వేయి కళ్లతో ఎదురు చూశారని, ఆయన విడుదలతో రాష్ట్రమంతా పండగ వాతావరణం నెలకొందన్నారు. కార్యక్రమంలో పల్లె తిరుపాల్‌రెడ్డి, పల్లె ఎల్లనాగిరెడ్డి, తోకర ఎల్లనాగిరెడ్డి, పల్లె సీతారామిరెడ్డి, ఎల్లాల శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 


 

మరిన్ని వార్తలు