మహిళల రక్షణకు ప్రత్యేక కార్యక్రమం

11 Aug, 2014 02:24 IST|Sakshi
మహిళల రక్షణకు ప్రత్యేక కార్యక్రమం

ఏలూరు : రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను, దాడులను నిరోధించి  ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే విధంగా సమాజంలోని యువత, ఇతరుల భాగస్వామ్యంతో చేపట్టే కార్యక్రమాలను స్త్రీ, శిశు సంక్షేమ, గనుల శాఖ మంత్రి పీతల సుజాత రూపొందించారు. ఆదివారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి నివాసంలో సుజాత సీఎం చంద్రబాబునాయుడును కలిసి కార్యక్రమాన్ని వివరించారు. ఈ సందర్భంగాసుజాతను సీఎం అభినందించారు.  సమాజంలోని యువతను చైతన్యపరిచి వారి ద్వారా మహిళలపై జరిగే దాడులను అరికట్టనున్నట్టు మంత్రి చెప్పారు.
 

మరిన్ని వార్తలు