ప్రత్యేక హోదాకు ‘కానుక’లు అడ్డంకి!

3 Feb, 2015 05:49 IST|Sakshi
  • బీజేపీ అధికార ప్రతినిధి సుధీష్ రాంబొట్ల వ్యాఖ్యలు
  • సాక్షి, హైదరాబాద్: ఏపీ ఆర్ధిక పరిస్థితి బాగా లేదని చెబుతున్న టీడీపీ సర్కారు మరోవైపు ‘చంద్రన్న కానుక’ తదితర పథకాల పేరుతో నిధులు వ్యయం చేయటంపై బీజేపీ రాష్ట్ర శాఖ నర్మగర్భ వ్యాఖ్యలు చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో ఇవి అడ్డంకిగా మారాయని రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి సుధీష్ రాంబొట్ల చెప్పారు. సోమవారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర పరిస్థితి బాగా లేకుంటే రుణమాఫీ, చంద్రన్న కానుక లాంటి పథకాలను ప్రభుత్వం ఎలా అమలు చేయగలుగుతోందని ఢిల్లీలో కొందరు వాదిస్తున్నారని తెలిపారు.  
     

మరిన్ని వార్తలు