విశాఖ–సికింద్రాబాద్‌ ప్రత్యేక రైళ్లు

25 Jun, 2019 09:11 IST|Sakshi

రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వివిధ ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు విజయవాడ రైల్వే డివిజన్‌ ఇన్‌చార్జి పీఆర్వో కె.రాజేంద్రప్రసాద్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం–సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు (08501) జూలై 2, 9, 16, 23, 30వ తేదీల్లో, ఆగస్టు 6, 13, 20, 27, సెప్టెంబర్‌ 3, 10, 17, 24 తేదీల్లో రాత్రి 11.00 గంటలకు  విశాఖపట్నంలో బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 12.00 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది. సికింద్రాబాద్‌–విశాఖ రైలు (08502) జూలై 3, 10, 17, 24, 31వ తేదీల్లో సికింద్రాబాద్‌లో సాయంత్రం 4.30లకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4.50కు విశాఖ చేరుకుంటుంది.

విశాఖపట్నం–తిరుపతి ప్రత్యేక రైలు (08573) జూలై 1, 8, 15, 22, 29, ఆగస్టు 5, 12, 19, 26, సెప్టెంబర్‌ 2, 9, 16, 23, 30వ తేదీల్లో రాత్రి 10.55కు విశాఖలో బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.25కు తిరుపతి చేరుకుంటుంది. తిరుపతి–విశాఖ  రైలు (08574) జూలై 2, 9, 16, 23, 30, ఆగస్టు 6, 13, 20, 27, సెప్టెంబర్‌ 3, 10, 17, 24 అక్టోబర్‌ 1వ తేదీల్లో మధ్యాహ్నం 3.30కు తిరుపతిలో బయలుదేరి మరుసటి రోజు ఉý యం 6.50కు విశాఖపట్నం చేరుకుంటుంది. 

మరిన్ని వార్తలు