హైదరాబాద్: రాష్ట్ర విభజన విషయంలో అన్ని రకాల ఆలోచనలకు, ఊహాగానాలకు తెరపడనుంది. విభజనకు సంబంధించిన మార్గదర్శకాలు ఈ నెల 26న వెలువడే అవకాశం ఉంది. దాంతో ముఖ్యంగా ఉద్యోగుల విభజన, ఆప్షన్ల విషయంలో స్పష్టత వస్తుంది. విభజనపై సచివాలయంలో సమీక్షలు జరుగుతున్నాయి. శాఖల వారీగా 30 శాఖల కార్యదర్శులు ఉన్నతాధికారులతో సమావేశమైయ్యారు. విభజన, పంపకాలపై సమీక్షలు జరుపుతున్నారు.
ఈ నెల 26 సోమవారం విభజన మార్గదర్శకాలపై ఉత్తర్వులు విడుదలవుతాయని తెలుస్తోంది. ఆ రోజు నుంచి విభజన ట్రెయిల్స్ కూడా ప్రారంభం అవుతాయి. విభజన విషయమై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి ఈ రోజు సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు.