హైదరాబాద్‌లో విశాఖవాసుల ఇక్కట్లు

3 May, 2019 08:21 IST|Sakshi
శంషాబాద్‌ విమానాశ్రయంలో వివరాలు సేకరిస్తున్న ప్రయాణికులు

స్పైస్‌ జెట్‌ విమానం రద్దు

ఎన్‌ఏడీ జంక్షన్‌(విశాఖ పశ్చిమ): శంషాబాద్‌ నుంచి విశాఖ బయలుదేరిన స్పైస్‌ జెట్‌ విమానం వాతావరణం అనుకూలించకపోవడంతో రద్దు చేశారు. దీంతో విశాఖ రావాల్సిన ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఈ విమానంలో సుమారు 80 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందులో ఇద్దరు ఐఏఎస్‌ అధికారులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. వీరితోపాటు వైఎస్సార్‌ సీపీ విధ్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీలకర్ర నాగేంద్ర కూడా ఉన్నారు. శుక్రవారం కూడా తుపాను ప్రభావం నేపథ్యంలో శనివారం ప్రయాణించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు