‘శ్రీశయన కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి’

11 Dec, 2018 06:54 IST|Sakshi
జగన్‌ను కలసి వినతి ఇస్తున్న డీపీ దేవ్‌

శ్రీకాకుళం అర్బన్‌: వ్యవసాయ కూలీలుగా, అసంఘటిత రంగ కార్మికులుగా జీవనం సాగిస్తున్న శ్రీశయన కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని శ్రీశయన సంఘ రాష్ట్ర అధ్యక్షుడు డీపీ దేవ్‌ కోరారు. వంజంగి గ్రామంలో ఏర్పాటు చేసిన శిబిరంలో జగన్‌ను ఆయన కలిసి వినతి ఇచ్చారు. శ్రీశయనుల జీవనస్థితి మెరుగుపడాలంటే ప్రత్యేక కార్పొరేషన్‌ ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు.

>
మరిన్ని వార్తలు