శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక ప్రధాని

11 Feb, 2020 08:45 IST|Sakshi

సాక్షి, తిరుమల: శ్రీలంక ప్రధాని మహింద్ర రాజపక్సే తిరుమలలోని శ్రీ వెకటేశ్వరస్వామిని మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. రాజపక్సేకి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రధాని రాజపక్సే ప్రత్యేక పూజాలు నిర్వహించారు. రాజపక్సేకు పూజారులు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి రామచంద్రారెడ్డి, టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈఓ ధర్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఐదు రోజుల పర్యటనలో భాగంగా శ్రీలంక ప్రధాని రాజపక్సే భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే.


 

మరిన్ని వార్తలు