కొణతాలకు పరామర్శ

4 Oct, 2016 04:22 IST|Sakshi
కొణతాలకు పరామర్శ

శ్రీకాకుళం న్యూకాలనీ: సతీ వియోగంతో బాధ పడుతున్న మాజీ మంత్రి కొణతాల రామకృష్ణను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతిలు పరామర్శించారు. వీరు సోమవారం అనకాపల్లిలోని కొణతాల నివాసానికి వెళ్లి ఆయనను ఓదార్చారు. ఈ సందర్భంగా కొణతాల భార్య సుజాత చిత్రపటం వద్ద నివాళులర్పించారు. కొణతాలను పరామర్శించిన వారిలో వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా నాయకులు ఎ.మురళీధరరావు, బి.ఈశ్వరరావు, కె.రమణమూర్తి, తదితరులు ఉన్నారు.
 

మరిన్ని వార్తలు