శ్రీశైలం మల్లన్న ఆదాయం రూ.2.21కోట్లు

7 Mar, 2014 01:38 IST|Sakshi

శ్రీశైలం, న్యూస్‌లైన్: శ్రీశైల మహాక్షేత్రంలో ఫిబ్రవరి 20 నుంచి మార్చి 4 వరకు జరిగిన బ్రహ్మోత్సవాలలో భక్తులు సమర్పించిన కానుకలను రెండు రోజుల పాటు లెక్కించగా రూ. 2,21,62,614 లభించినట్లు ఈఓ చంద్రశేఖర అజాద్ గురువారం విలేకరులకు తెలిపారు. అక్కమహాదేవి అలంకార మండపంలో బుధ, గురువారాలలో హుండీల ఆదాయాన్ని లెక్కిం చారు. ఈ లెక్కింపులో నగదుతో పాటు 1,057 యుఎస్ డాలర్లు, 140కువైట్ దినార్లు, 30యుఏ పౌండ్లు, 10 ఆస్ట్రేలియా డాలర్లు, 20 సింగపూర్ డాలర్లు, 10 సౌదీ రియాల్స్, 10 మలేషియా రింగెట్స్ లభించాయన్నారు.

మరిన్ని వార్తలు