మ.12.30 గంటలకు రమాకాంత్రెడ్డి ప్రెస్మీట్

3 Jul, 2013 11:28 IST|Sakshi

హైదరాబాద్ : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్రెడ్డి ఈరోజు మధ్యాహ్నం ప్రెస్మీట్లో మాట్లాడనున్నారు. పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదల అయిన వెంటనే ఎన్నికల కోడ్ తక్షణం అమల్లోకి రానుంది.

ఎల్లుండి జిల్లాల వారీగా కలెక్టర్లు నోటిఫికేషన్లు ఇవ్వనున్నారు. కాగా పంచాయతీ ఎన్నికల తేదీలు ఖరారు అయ్యాయి. మూడు దశలుగా ... ఈనెల 23,.27,31 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.

మరిన్ని వార్తలు