మొహర్రం సెలవు 15వ తేదీకి మార్పు

12 Nov, 2013 01:02 IST|Sakshi

ఐచ్చిక సెలవు 13 నుంచి 14కు సవరణ
 సాక్షి, హైదరాబాద్: మొహర్రం సెలవును రాష్ట్ర ప్రభుత్వం 14వ తేదీకి బదులుగా 15వ తేదీకి మార్చింది. కేంద్ర ప్రభుత్వం మొహర్రం సెలవును 15వ తేదీకి మార్చడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అందుకు అనుగుణంగా సెలవును సవరిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొహర్రం సెలవు మారడంతో ఐచ్చిక సెలవును కూడా 13వ తేదీకి బదులుగా 14వ తేదీకి మార్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొహర్రం సందర్భంగా 15వ తేదీన బ్యాంకులకు సెలవు ప్రకటించారు.

మరిన్ని వార్తలు