న్యూఢిల్లీ : జగతి పబ్లికేషన్స్కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ న్యాయప్రాధికారి సంస్థ ఇచ్చిన తీర్పుపై అప్పిలేట్ ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. జగతిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్.. 51 కోట్ల రూపాయల ఆస్తుల్ని జప్తు చేసింది.
ఈ జప్తు సరైనదేనంటూ న్యాయప్రాధికార సంస్థ తీర్పు ఇచ్చింది. దీనిపై జగతి లాయర్లు అప్పిలేట్ ట్రిబ్యునల్లో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను పరిశీలించిన ట్రిబ్యునల్.. ప్రాధికార సంస్థ ఇచ్చిన తీర్పు పై స్టే ఇచ్చింది. తదుపరి విచారణను ఆగస్టు 18కి వాయిదా వేసింది.