పరీక్షల్లో ఫెయిలవడంతో విద్యార్థిని ఆత్మహత్య

17 Jun, 2016 23:11 IST|Sakshi

యాడికి: పరీక్షల్లో ఫెయిలయ్యానని మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన అనంతపురం జిల్లాలోని యాడికి మండలం బోగాలకట్ట గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటేశ్వరమ్మ(23) విజయవాడలోని ఓ ప్రైవేటు కళశాలలో ఎంబీఏ చదువుతోంది. సెమిస్టర్ పరీక్షలు పూర్తయ్యాక ఆమె గత కొన్ని రోజులుగా ఇంటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. అందులో వెంకటేశ్వరమ్మ ఉత్తీర్ణత చెందకపోవడంతో మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు