ఈతకు వెళ్లి విద్యార్థి మృతి

31 Jan, 2016 16:38 IST|Sakshi

స్నేహితులతో కలిసి ఈత కు వెళ్లిన విద్యార్థి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందాడు. ఈ సంఘటన కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం కొడవటికల్లు గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీరామ్(15) స్థానిక పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఈ రోజు ఆదివారం కావడంతో.. స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

 

మరిన్ని వార్తలు