అందరికీ మంచి..

23 Oct, 2018 08:20 IST|Sakshi
జగన్‌మోహన్‌రెడ్డితో మాట్లాడుతున్న పక్కి హేమావతి

విజయనగరం : జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే బడుగు, బలహీన వర్గాల వారికి మంచి జరుగుతుందని జన్నివలస గ్రామానికి చెందిన పక్కి హేమలత అన్నారు. జన్నివలస వద్ద జననేతను కలిసి సమస్యలు వివరించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తాను 8వ తరగతి చదువుతున్నప్పుడువ స్టోన్‌ క్రషర్‌ వద్ద జరిగిన ప్రమాదంలో కుడిచేయి, మెడ వద్ద తీవ్ర గాయాలయ్యాయన్నారు. అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా ఉచితంగా శస్త్రచికిత్స జరిగిందని తెలిపారు. అలాగే ఎన్‌ఆర్‌ఐ దాతల సహాయంతో కోయంబత్తూరులో కూడా మూడు శస్త్రచికిత్సలు జరిగియాని జననేత దృష్టికి తీసుకువచ్చింది.  ప్రస్తుతం నూజివీడులో ట్రిపుల్‌ ఐటీ చేశానని, పారా ఒలింపిక్స్‌లో పాల్గొని పతకం సాధించడమే తన లక్ష్యమని స్పష్టం చేసింది.తన తల్లి సింహాచలం రోజు కూలీ కాగా తండ్రి రామ్మోహనరావు పెయింటర్‌గా పనిచేస్తున్నారని.. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే తన తల్లిదండ్రులకు ఉపాధి కల్పించి ఆదుకోవాలని కోరింది.

మరిన్ని వార్తలు