వాగులో విద్యార్థి గల్లంతు

13 Dec, 2015 19:48 IST|Sakshi

రంపచోడవరం: తూర్పుగోదావరి జిల్లా ఐ పోలవరం జంక్షన్ సమీపంలో సీతంపల్లి వాగులో ఓ విద్యార్థి గల్లంతయ్యాడు. కోరుకొండలోని ఓ పాఠశాలకు చెందిన విద్యార్థులు వనభోజనం కోసం ఆదివారం సీతంపల్లికి వచ్చారు. కొంత మంది విద్యార్థులు సీతంపల్లి వాగులో దిగగా, పదో తరగతి విద్యార్థి ద్వారంపూడి మనోహర్ (15) గల్లంతయ్యాడు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాజమండ్రి బొమ్మూరుకు చెందిన మనోహర్ కోరుకొండలో చదువుకుంటున్నాడు.

మరిన్ని వార్తలు