సాక్షి, విశాఖపట్నం : భీమిలి బీచ్లో జరుగుతున్న ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. కార్నివాల్లో వదిలిన గ్యాస్ బెలూన్లు చెట్టుకున్న తేనెపట్టును ఢీకొట్టాయి. దీంతో ఒక్కసారిగా తేనేటీగలు అక్కడున్న విద్యార్థులపై దాడిచేశాయి. స్వల్పగాయాలు కావడంతో చికిత్స అందించారు.సుమారు పదిహేను మంది విద్యార్థులు గాయపడ్డారు. వీరంతా ఏఎంజీ పాఠశాలకు చెందిన వారుగా గుర్తించారు.