శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

28 Sep, 2015 01:02 IST|Sakshi
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు

కలియుగదైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారిని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆదివారందర్శించుకున్నారు. ఏపీ రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణతో పాటు మాజీ మంత్రి టీజీ వెంకటేశ్ కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు.

సుబ్రహ్మాణ్యం ఫర్ సేల్ చిత్ర సభ్యులు నిర్మాత దిల్ రాజు, దర్శకుడు హరీష్ శంకర్, హీరో సాయిధర్మతేజ తదితరులు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ నిర్వాహకులు స్వాగతం పలికి లడ్డూ ప్రసాదాలు అందజేశారు.
 

మరిన్ని వార్తలు