అనారోగ్యంతో బాధపడుతోంది ఆదుకోండయ్యా

18 Jul, 2018 07:12 IST|Sakshi

తూర్పుగోదావరి : నా కూతురు అనారోగ్యంతో బాధపడుతోంది, ఆదుకోవాలని అంటూ ఏపిత్రయానికి చెందిన దువ్వా జగ్గారావు జగన్‌ను కోరారు. తన కుమార్తె అనూషకు రెండేళ్ల క్రితం కడుపులో తలెత్తిన సమస్యకు శస్త్ర చికిత్స చేయించామని, అప్పటి నుంచి ఒళ్లంతా పొక్కులు వచ్చి, కాళ్లు వాచి ఇబ్బంది పడుతోందని అన్నాడు. ప్రభుత్వాస్పత్రిలో చికిత్స చేయిస్తున్నా నయం కావడంలేదని, ఆదుకోవాలని కోరాడు.

మరిన్ని వార్తలు