పెద్దలకు భయపడి విషం తాగిన ప్రేమికులు

8 May, 2017 19:22 IST|Sakshi

కుక్కునూరు(పశ్చిమ గోదావరి జిల్లా): కుటుంబ పెద్దలు తమ పెళ్లికి అంగీకరించలేదని ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుక్కునూరు మండలం పాములేరు వద్ద ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అశ్వాపురం మండలం జగ్గారంకు చెందిన ఆటో డ్రైవర్ కిషోర్(23), ఆశ్వాపురం మండల కేంద్రం మంచికంటి నగర్ కు చెందిన నవ్య అనే యువతి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.

అయితే, ఇటీవలె ఈ విషయం వాళ్ల ఇళ్లల్లో తెలియడం, వారి పెళ్లికి అంగీకరించని కారణంతో ఇద్దరూ కలిసి పాములేరు వద్ద పురుగుల మందు తాగారు. స్థానికులు గుర్తించి పోలీసులకు, 108 వాహనానికి సమాచారం అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు