‘మహీంద్రా’ను సందర్శించిన ప్రిన్స్

31 Aug, 2013 00:30 IST|Sakshi

 జహీరాబాద్, న్యూస్‌లైన్: సినీ నటుడు మహేష్‌బాబు శుక్రవారం జహీరాబాద్ సమీపంలోని మహీంద్రా అండ్ మహీంద్రా కర్మాగారాన్ని సందర్శించారు. మహీంద్రా ట్రాక్టర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నందున యాజమాన్యం మహేష్‌బాబును స్థానిక ట్రాక్టర్ యూనిట్‌కు ఆహ్వానించి రైతులతో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడి ట్రాక్టర్ పనితనం గురించి తెలుసుకున్నట్టు సమాచారం. మహేష్‌బాబు రాక సందర్భంగా కర్మాగారం పరిసరాల్లోకి ఇతరులనెవ్వరినీ అనుమతించలేదు. కార్యక్రమాన్ని ముగించుకున్న అనంతరం ఆయన తిరిగి హైదరాబాద్ వెళ్లారు.
 

మరిన్ని వార్తలు