ఏపీ, తెలంగాణ హైకోర్టులకు నూతన జడ్జీలు

16 Apr, 2019 18:59 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ హైకోర్టులకు నూతన న్యాయమూర్తుల నియామకంపై సుప్రీం కోర్టు కొలీజియం కసరత్తు ముమ్మరం చేసింది. ఏపీ హైకోర్టుకు బిఎస్‌ భానుమతి, సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌, ఎం వెంకటరమణ, ఏ. హరిహరనాథ శర్మలను నియమించాలని సిఫార్సు చేసింది.

ఇక తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా శ్రీసుధ, సుమలత, ఎన్‌ తుకారాంజీల పేర్లను సుప్రీం కొలీజియం సిఫార్సు చేసింది. కాగా, ఏపీ నూతన హైకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తిగా అలహాబాద్‌ హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి విక్రమ్‌ నాధ్‌ను కొలీజియం ఇటీవల ఖరారు చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు