శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు జస్టిస్‌

6 Jun, 2017 01:25 IST|Sakshi
శ్రీవారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు జస్టిస్‌

సాక్షి, తిరుమల: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ సోమవారం మరోసారి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి ఉదయం నైవేద్య విరామ సమయం అనంతరం ఆయన ఆలయానికి వచ్చారు. ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. తర్వాత శ్రీవారిని, వకుళమాతను దర్శించుకుని, హుండీలో కానుకలు సమర్పించారు. తర్వాత జస్టిస్‌ రమణ తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.

మరిన్ని వార్తలు