శ్రీవారి సేవలో జస్టిస్ ఎన్‌ వీరమణ

7 Nov, 2014 02:01 IST|Sakshi
శ్రీవారి సేవలో జస్టిస్ ఎన్‌ వీరమణ

సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తొలుత ఆయన తిరుపతి నుంచి తిరుమలకు కాలినడకన వచ్చారు. తర్వాత  పౌర్ణమి గరుడసేవలో పాల్గొని మలయప్పస్వామిని దర్శించుకున్నారు. రాత్రి నైవేద్య విరామ సమయం తర్వాత ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. తర్వాత పచ్చ కర్పూర వెలుగులో గర్భాలయ మూలమూర్తిని దర్శించుకున్నారు. అనంతరం వకుళమాతను దర్శించుకుని, హుండీలో కానుకలు సమర్పించారు.    
 - సాక్షి, తిరుమల
 

మరిన్ని వార్తలు