ఒంగోలు టౌన్ : జిల్లాలోని ప్రజలు అత్యంత ఆనందంగా ఉన్నారా..? లేకుంటే దుఖంగా ఉన్నారా..? అనే విషయమై జిల్లా యంత్రాంగం సర్వే చేపట్టనుంది. హ్యాపీనెస్ సర్వే పేరుతో ఈనెల 29 నుంచి 31వ తేదీ వరకు సర్వే నిర్వహించనుంది. వివిధ రంగాలకు చెందిన వారి నుంచి వివరాలను సేకరించనుంది. జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన 1500 మందిని ఎంపిక చేసుకొని వారి నుంచి ఐదురకాల అంశాల ద్వారా వారి స్థితిగతులను తెలుసుకొని అత్యంత ఆనందంగా ఉన్నారా..? విచారంతో ఉన్నారా..?అనే వివరాలను తెలుసుకోనుంది. ఈ సర్వే నిర్వహణ బాధ్యతలను మండల తహసీల్దార్ కార్యాలయాల్లో సహాయ గణాంకాధికారులుగా
పనిచేస్తున్న వారికి అప్పగించింది. వారివద్ద ఉన్న ట్యాబ్లు, ఆండ్రాయిడ్ ఫోన్లకు సర్వేకు సంబంధించిన అప్లికేషన్ అప్లోడ్ చేశారు. దీంతో సహాయ గణాంకాధికారులు ఏరోజుకారోజు తాము నిర్వహించిన సర్వే వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. జిల్లాలో మూడురోజులపాటు జరగనున్న సర్వే ప్రక్రియను ముఖ్య ప్రణాళికాధికారి కేటీ వెంకయ్య ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సహాయ గణాంకాధికారులకు సలహాలు, సూచనలు అందించనున్నారు.
సర్వే నిబంధనలు..
జిల్లాలో హ్యాపీనెస్కు సంబంధించిన నిర్వహించనున్న సర్వేలో ఐదురకాల అంశాలను ప్రామాణికంగా తీసుకొని సహాయ గణాంకాధికారుల బృందం వివరాలను సేకరించాల్సి ఉంటుంది.
వివరాలు సేకరించే ఐదు అంశాలు ఇవే..
సర్వే పక్కాగా నిర్వహించాలి..
జిల్లాలో హ్యాపీనెస్ సర్వేను పక్కాగా చేపట్టాలని ముఖ్య ప్రణాళికాధికారి కేటీ వెంకయ్య ఆదేశించారు. శనివారం స్థానిక వీడియో కాన్ఫరెన్స్ హాలులో జిల్లాలోని సహాయ గణాంకాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సర్వేకు సంబంధించిన ప్రామాణికాలను కచ్చితంగా పాటించాలన్నారు. సమస్య తలెత్తకుండా నిర్ణీత వ్యవధిలోగా వివరాలు అందించాలని సూచించారు.