వివాహిత అనుమానాస్పద మృతి

7 Nov, 2015 12:34 IST|Sakshi

పురుగుల మందు తాగి మహిళ మృతిచెందిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పెనకనమెట్ట గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తోట నాగమణి(43) ఇంట్లో అనుమానాస్పదంగా మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. భర్తే బలవంతంగా పురుగుల మందు తాగించి ఆ తర్వాత ఆత్మహత్యలా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నాడని స్థానికులు అంటున్నారు.

 

మరిన్ని వార్తలు