‘టీటీడీ చరిత్రలో ఇంత అసమర్ధుడైన ఈఓను చూడలేదు’

21 Apr, 2019 11:54 IST|Sakshi

సాక్షి, తిరుమల : శ్రీవారి బంగారాన్ని మాయం చేయడానికే బ్యాంకు నుండి తీసుకొచ్చారని స్వామి కమలానంద భారతి మండిపడ్డారు. టీటీడీ చరిత్రలో సింఘాల్ లాంటి అసమర్ధుడైన ఈఓను ఎప్పుడూ చూడలేదని ధ్వజమెత్తారు. తిరుమల జేఈవో శ్రీనివాస రాజు హిందూ మత వ్యతిరేకి అని, అవినీతి పరుడని నిప్పులు చెరిగారు. 400 కోట్ల రూపాయల బంగారం స్కాంలో ప్రధాన పాత్రదారులైన టీటీడీ ఈఓ, జేఈఓలను వెంటనే అరెస్టు చెయ్యాలని డిమాండ్‌ చేశారు. బంగారం స్కాంపై సీబీఐతో లేదా న్యాయమూర్తులతో కానీ విచారణ జరిపించాలన్నారు.
 

మరిన్ని వార్తలు