తిరుమలలో నిత్యానంద, రంజిత ప్రత్యక్షం

18 Jun, 2014 12:05 IST|Sakshi
తిరుమలలో నిత్యానంద, రంజిత ప్రత్యక్షం

తిరుమల : గత కొద్ది కాలంగా అజ్ఞాతంలో ఉంటున్న వివాదాస్పద ఆధ్మాత్మిక గురువు స్వామి నిత్యానంద, ఆయన  సహాయకరాలు రంజిత బుధవారం తిరుమలలో ప్రత్యక్షం అయ్యారు. ఈరోజు ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో నిత్యానంద తన శిష్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. కాషాయ వేషధారణలో ఉన్న రంజిత...నిత్యానందతో కలిసి స్వామివారి దర్శనానికి వచ్చింది.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడేందుకు నిత్యానంద నిరాకరించారు. కాగా  రంజిత ఇటీవలే బెంగళూరులోని బిడిది ధ్యానపీఠంలో సన్యాసం స్వీకరించిన విషయం తెలిసిందే. ఆమె తన పేరును మా ఆనందమయి గా మార్చుకుంది.

 

మరిన్ని వార్తలు