స్వచ్ఛభారత్ రాజకీయ ప్రచారానికే...

17 Apr, 2015 18:20 IST|Sakshi
స్వచ్ఛభారత్ రాజకీయ ప్రచారానికే...

విశాఖపట్నం: ప్రధాని నరేంద్రమోదీ స్వచ్ఛ భారత్ కార్యక్రమం కేవలం రాజకీయ ప్రచారం కోసమేనని సీపీఎం నేత సీతారాం ఏచూరీ విమర్శించారు. ఎన్నికల్లో తాము ఇక ఎవరితోనూ పొత్తులు పెట్టుకోబోమని స్పష్టం చేశారు. శుక్రవారం ఇక్కడి సమావేశంలో మాట్లాడిన ఆయన అంశాల వారిగానే పార్లమెంటు లోపల, వెలుపల మద్దతు కూడగట్టుకుని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. కేంద్రం ఇంటర్నెట్పై ఆంక్షలు విధించాడాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందని తెలిపారు. కాగా, పనిచేసే చోటుతోపాటు బహిరంగ ప్రదేశాల్లో కూడా పురుషుడి ప్రవర్తన బాగుండాలని సూచించారు.

మరిన్ని వార్తలు