6న రాజమండ్రిలో దీక్ష చేస్తా: టీఎస్సార్

25 May, 2015 12:46 IST|Sakshi
6న రాజమండ్రిలో దీక్ష చేస్తా: టీఎస్సార్

విశాఖపట్నం: ఏపీకి ప్రత్యేక హోదా సాధించే వరకు కాంగ్రెస్ పార్టీ నిద్రపోదని రాజ్యసభ సభ్యుడు టి. సుబ్బిరామిరెడ్డి అన్నారు. జూన్ 3, విశాఖపట్నం, 4న విజయనగరం, 5న శ్రీకాకుళం జిల్లాల్లో భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టనున్నట్టు ప్రకటించారు. ప్రత్యేక హోదా డిమాండ్ తో జూన్ 6న రాజమండ్రిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష చేస్తానని అన్నారు. విశాఖ విమ్స్ ను ఎయిమ్స్ గా మార్చాలని, హైకోర్టు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఏపీలో టీడీపీ, కేంద్రంలో ఎన్డీఏ పాలన ప్రజలకు మేలు చేయడంలో వైఫల్యం చెందాయని కాంగ్రెస్ నాయకుడు ద్రోణంరాజు శ్రీనివాస్ విమర్శించారు. ప్రత్యేక రైల్వే జోన్ సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు.

మరిన్ని వార్తలు