ప్రతిపక్ష నేతపై నేను చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదు: స్పీకర్‌

16 Nov, 2019 03:59 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: ప్రతిపక్ష నాయకుడి విషయంలో తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదని ఏపీ శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. విశాఖలో శుక్రవారం బాలల సంరక్షణ పరిరక్షణ వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో లక్షలాది మంది అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం సభలో చర్చకు సిద్ధమైనప్పుడు ప్రతిపక్షం ఆటంకం కలిగిస్తే.. ఇది సరికాదని ప్రతిపక్ష నాయకుడికి చెప్పానే తప్ప విమర్శించలేదన్నారు.

రానున్న శీతాకాల సమావేశాల్లో సభలో ఓ ప్రతిపక్ష నేతగా హుందాగా వ్యవహరిస్తే తాను స్వాగతిస్తానన్నారు. అపార అనుభవం ఉన్న ప్రతిపక్ష నాయకుడు స్పీకర్‌తో ఎలా మెలగాలో తెలుసుకుని.. వచ్చే అసెంబ్లీ సమావేశాలను ప్రజా శ్రేయస్సుకు ఉపయోగించుకోవాలని కోరారు. ఫిరాయింపులకు పాల్పడితే ఏ పార్టీ వారినైనా ఉపేక్షించేది లేదని స్పీకర్‌ తమ్మినేని సీతారాం హెచ్చరించారు. 

మరిన్ని వార్తలు