ఉగాండా పర్యటనకు స్పీకర్‌ తమ్మినేని

18 Sep, 2019 18:00 IST|Sakshi

సాక్షి, అమరావతి : విదేశీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఉగాండాలో పర్యటించనున్నారు. ఈ నెల 24 నుంచి 7వ తేదీ వరకు ఆ దేశంలో జరిగే 64వ కామన్‌వెల్త్‌ పార్లమెంటరీ కాన్ఫరెన్స్‌కు స్పీకర్‌ హాజరుకానున్నారు. ఈ సమావేశంలో యువత, నిరుద్యోగిత, ప్రభుత్వ పాత్ర అనే అంశంపై ఆయన ప్రసంగించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ యువతకు ఉద్యోగాల కల‍్పన అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు. అనంతరం స్విట్జర్లాండ్‌, పారిస్‌లోనూ స్పీకర్‌ పర్యటించనున్నారు. 

మరిన్ని వార్తలు