ఇండిక్యాష్ ఏటీఎమ్ ధ్వంసం..

28 Aug, 2015 09:09 IST|Sakshi
ఇండిక్యాష్ ఏటీఎమ్ ధ్వంసం..

తెనాలి:  గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగులో శుక్రవారం తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు టాటా సంస్థకు చెందిన ఇండిక్యాష్ ఏటీఎమ్‌ను ధ్వంసం చేశారు.

గ్రామంలో ఉన్న టాటా క్యాష్ ఏటీఎమ్‌ను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ టీవీ ఫూటేజీలను పరిశీలిస్తున్నారు. కాగా, ఏటీఎమ్ నుంచి క్యాష్ దొంగలించారా? లేదా అన్న విషయాన్ని ఏటీఎమ్ అధికారులు తెలపాల్సి ఉంది.

మరిన్ని వార్తలు