ఒంగోలు: టిడిపి వారి ఆగడాలకు అంతుపంతులేకుండా ఉంది. సాధారణంగా ఎన్నికలు అయిపోయిన తరువాత రాజకీయాలు, పార్టీలను పెద్దగా ఎవరూ పట్టించుకోరు. టిడిపి వారు తమకు ఓటు వేయలేదని చనిపోయిన వ్యక్తిపై కూడా కక్షతీర్చుకుంటున్నారు.చనిపోయిన వ్యక్తి టిడిపికి ఓటు వేయలేదని టిడిపి వర్గీయులు అతని శవాన్ని శ్మశానంలోకి కూడా అనుమతించడంలేదు.
ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం తంగేడుమల్లి గ్రామంలో ఈ ఘటన జరుగుతోంది. గ్రామంలో వైఎస్ఆర్సీపీకి చెందిన ఒక వ్యక్తి చనిపోయాడు. అయితే అతను టిడిపికి ఓట్లు వేయలేదని, ఆ శవాన్ని, వైఎస్ఆర్ సిపి వర్గీయులను టిడిపి వర్గీయులు శ్మశానంలోకి అనుమతించలేదు. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
**