బాబు నమ్మకాన్ని వమ్ము చేయరు

3 Mar, 2016 01:47 IST|Sakshi

 టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు
 
కొరిటెపాడు (గుంటూరు) :  ప్రజలు చంద్రబాబుపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయరని టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు పేర్కొన్నారు. పార్టీ జిల్లా  కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటికే సగానికిపైగా అమలు చేయటం జరిగిందని తెలిపారు. ప్రజాప్రయోజనాల కోసమే ఉచితంగా ఇసుక విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు అభివృద్ధికి సహకరించకపోవడం బాధాకరమన్నారు. ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ మాట్లాడుతూ ప్రజా రాజధానిని నిర్మించేందుకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు ఎస్‌ఎం జియావుద్దీన్, దాసరి రాజామాస్టారు, శనక్కాయల అరుణ, మన్నవ సుబ్బారావు, ఇక్కుర్తి సాంబశివరావు, చంద్రగిరి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు