మంత్రి సోమిరెడ్డి రెండు నాల్కల ధోరణి
ఇచ్చిన హామీలు గాలికి
అధికారంలోకి రాగానే మిన్నకుండిపోయిన వైనం
ముత్తుకూరు మండలంలో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు తగదని, కాలుష్యం పెరిగిపోతుందంటూ అప్పట్లో వీరోచితంగా పోరాటాలు చేసిన సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి అధికారంలోకి రాగానే అన్నింటినీ మర్చిపోయారు. ప్రాజెక్టులకు అతి సన్నిహితులయ్యారు. ఎమ్మెల్సీ, వ్యవసాయశాఖ మంత్రి పదవి దక్కించుకొన్న తర్వాత చేసిన వాగ్దానాలు, ఇచ్చిన హామీలను కూడా అటకెక్కించారు. అవేవీ గుర్తులేనట్లుగా వ్యవహరిస్తున్నారు. సోమిరెడ్డి రెండు నాల్కల ధోరణిపై ఈ ప్రాంత ప్రజలు మండిపడుతున్నారు.
సాక్షి, ముత్తుకూరు: రాష్ట్రంలో విద్యుత్ కొరత తీర్చేందుకు, కోతలు నివారించేందుకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పబ్లిక్, ప్రైవేటు రంగాల్లో విద్యుత్ ప్రాజెక్టులు మంజూరు చేశారు. ముత్తుకూరు మండలంలో థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు కృషి చేశారు. బొగ్గు దిగుమతికి వీలుగా ఉన్న కృష్ణపట్నం పోర్టుకు సమీపంలో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. టీడీపీకి రాని ఆలోచన వైఎస్కి వచ్చిందన్న అక్కసుతో నాడు ప్రతిపక్షంలో ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి థర్మల్ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఆందోళనలు సాగించారు. బొగ్గు కాల్చడం వల్ల వచ్చే బూడిద, పొగ, ఇతర వాయువుల మోతాదును గణాంకాలతో వివరిస్తూ నాయకులు, కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు. యాష్పాండ్ల ఏర్పాటుపై పోరాటం చేశారు. చంద్రబాబును తీసుకువచ్చి ముసునూరువారిపాళెంలో సభ పెట్టించారు. అయితే, విద్యుదుత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించి, పారిశ్రామికాభివృద్ధి కృషి చేయాలన్న ఏకైక లక్ష్యంతో వైఎస్సార్ థర్మల్ ప్రాజెక్టులను పూర్తి చేయాలనే లక్ష్యంతో పనిచేశారు.
అధికారంలోకి రాగానే..
2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఎమ్మెల్సీ పదవి దక్కించుకొన్నారు. మంత్రి పదవి పొందారు. థర్మల్ ప్రాజెక్టుల పట్ల వైఖరి మార్చుకున్నారు. ప్రాజెక్టుల నుంచి వెలువడే కాలుష్యాన్ని పట్టించుకోవడం మానేశారు. కాలుష్యం వల్ల పంటలు, గ్రామాలు పాడైపోవడం విస్మరించారు. యాష్పాండ్పై పోరాటాలు చేసిన సోమిరెడ్డి రెండో యాష్పాండ్ నిర్మాణ కాంట్రాక్టును తన వాళ్లకు ఇప్పించుకోవడం కొసమెరుపు.
సోమిరెడ్డి హామీలు హుష్కాకి