నామినేషన్‌ వేసిన టీడీపీ అభ్యర్ధులు

12 Mar, 2018 12:27 IST|Sakshi

అమరావతి: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులుగా సీఎం రమేశ్‌, న్యాయవాది కనకమేడల రవీంద్రకుమార్‌ సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. కాగా ఇప్పటికే రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న సీఎం రమేశ్‌ పదవీకాలం ఈ నెలలో ముగియనుంది. ఇక కనకమేడల రవీంద్ర గతంలో టీడీపీ లీగల్‌సెల్‌ అధ్యక్షుడిగా.. బెజవాడ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా, బార్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా పనిచేశారు. కృష్ణా జిల్లాకు చెందిన ఈయన పేరు చివరి నిమిషంలో ఖరారైంది. 

మరిన్ని వార్తలు