వాస్తవ భూమిని కొలతల్లో తగ్గించి నాయకుల పేరిట బదలాయింపు
సర్కారు నుంచి కౌలు తీసుకుని.. ప్లాట్లు పొంది... విక్రయం
గ్రామ నాయకుల నుంచి ముఖ్య నేతల వరకు అక్రమాలు కోకొల్లలు
రాజధాని అమరావతి నిర్మాణానికంటూ గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో గత తెలుగుదేశం ప్రభుత్వం భూ సమీకరణ (ల్యాండ్ పూలింగ్) పేరిట తీసుకున్న భూముల్లో అంతులేని అక్రమాలు చోటుచేసుకున్నాయి. పేద, సన్న, చిన్న కారు రైతులను అడ్డగోలుగా మోసగించి స్థానిక నాయకులు మొదలు నాటి ప్రభుత్వ పెద్దల వరకు సొంతం చేసుకున్నారు. పెద్దల ముసుగులో కొందరు, ప్రజాప్రతినిధుల అనుచరుల పేరిట మరికొందరు, బడాబాబులుగా చెలామణి అయినవారు... ఎవరి స్థాయిలో వారు పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను లాగేసుకున్నారు. ప్రభుత్వ భూములను కాజేశారు. దేవదాయ, వక్ఫ్ ఆస్తులతో పాటు వాగులు, వంకలు, కుంటలు, చెరువులు, చేద బావులు, శ్మశాన స్థలాలను కాజేశారు. చివరకు రోడ్లను కూడా కలిపేసుకున్నారు.
సాక్షి, కృష్ణా: తుళ్లూరు మండలం నెక్కల్లు గ్రామ పరిధిలో భూ సమీకరణలో ఎన్నో అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఎకరానికి రెండు నుంచి 70 సెంట్ల వరకు అక్రమంగా నొక్కేశారు. ప్రధానంగా ఒక సామాజిక వర్గానికి చెందిన అన్ని స్థాయిల్లోని నాయకులు, కొందరు ఉన్నతాధికారులు కుమ్మక్కయి గ్రామంలోని వెనుకబడిన వర్గాలు, ఎస్సీల భూములను కాజేశారు. పూలింగ్కు భూమి ఇవ్వకపోతే అది అలాగే మిగిలిపోతుంది. ఎందుకూ పనికిరాదు. చివరకు ప్రభుత్వం లాగేసుకుంటుంది అని బెదిరించారు. సర్వేలో వాస్తవ భూమిని తగ్గించేసి పలుకుబడి కలిగిన ఒక సామాజికవర్గానికి చెందిన నాయకులకు రికార్డుపరంగా ఇచ్చేశారు.
కావేవీ కబ్జాకు అనర్హం
నెక్కల్లు గ్రామ సర్వే నెంబరు 54లో చెక్డ్యాం నిర్మితమైంది. దీనికి సంబంధించిన 1.24 ఎకరాలను చేజిక్కించుకున్నారు.
అక్రమాలు ఎలా బయటపడ్డాయంటే..
మూడు రాజధానులను ప్రస్తుత ప్రభుత్వం ప్రకటించింది. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఏర్పాటైన జేఏసీ ఉద్యమం కొనసాగింపునకు చందాలకు సిద్ధమైంది. రాజధాని గ్రామాల్లోని రైతులు ఒక్కో ఎకరానికి రూ.పది వేలు చొప్పున ఇవ్వాలని తీర్మానించి తొలివిడతగా రూ.రెండు వేలు చొప్పున వసూళ్లు ప్రారంభించింది. నెక్కల్లుకు చెందిన రావెల గోపాలకృష్ణ తన వంతుగా పెద్దమొత్తాన్ని ఇవ్వడాన్ని గుర్తించిన స్థానికులు రికార్డుల్లో ఎంత భూమిని చూపారనేది ఆరా తీశారు. వాస్తవ భూమికన్నా అదనపు భూమి రికార్డుల్లో ఉందని, ఆ అదనపు భూమి ఎక్కడి నుంచి వచ్చిందనేది పరిశీలింపజేశారు. బీసీ లు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారీ్టల భూమిని త గ్గించేసి రావెల, ఆయన అనుచరులకు ఇచ్చా రని తేటతెల్లమైంది. ఇదే అంశమై తుళ్లూరు తహసీల్దార్కు ఫిర్యాదు చేయడంతో స్థానిక పోలీసుస్టేషన్లో కేసు కూడా నమోదైంది.
ప్రశ్నించడంతో చక్కదిద్దే పనిలో అధికారులు..
సీఆర్డీఏ ఏర్పడినప్పటి నుంచి అధికారిణి ఒకరు నెక్కల్లులోనే పనిచేస్తున్నారు. తెలుగుదే«శం ప్రభుత్వం పోయి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైన తరువాత పేదలకు గొంతుక వచ్చింది. తమకు జరిగిన అన్యాయాన్ని గుర్తించి అధికారులను ప్రశ్నించడం ప్రారంభించారు. తమ భూములు తగ్గించి ఓ సామాజికవర్గం నేతల పేరిట రాశారని ఆ మహిళా అధికారిని నిలదీశారు. అందుకు తగి న ఆధారాలను కూడా చూపడంతో తప్పుల ను కప్పిపుచ్చుకునే పనుల్లో నిమగ్నమయ్యా రు. రావెలకు కేటాయించిన పది ప్లాట్లకు చెందిన డాక్యుమెంట్లు (101/2020, 102/2020, 103/2020, 104/2020, 105/2020, 106/2020, 107/2020, 108/2020 )ను తాజాగా రద్దుచేశారు. రెండు డాక్యుమెంట్లు ఇంకా రద్దు కాలేదు. కాగా రావెల ఇతరులకు విక్రయించిన అయిదు ప్లాట్ల డాక్యుమెంట్లను మాత్రం రద్దు చేయలేదు.
న్యాయం చేయాలి
‘మా గ్రామంలో అక్రమాలు జరిగాయి. బీసీ లు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారీ్టలకు చెందిన పేద రైతులకు చెందిన భూములను గ్రామంలో పెద్దమనుషులుగా చెలామణి అయిన వారు కాజేశారు. వారికి అప్పటి సీఆర్డీఏ అధికారు లు సహకరించారు. సర్వే పేరిట దారుణ మో సాలకు ఒడిగట్టారు. కౌలు పొందారు. ప్లాట్లు తీసుకున్నారు. వాటిని అమ్ముకుని కోట్లకు కోట్లు కొల్లగొట్టారు’. మాలాంటి పేదలు 29 గ్రామాల పరిధిలో ఎందరో నష్టపోయిన వారున్నారు. ప్రభుత్వమే పేదలకు న్యాయం చేయాలని నెక్కల్లు వాసులు కోరుతున్నారు.
భూమి సర్వే పేరిట ప్రారంభించి..
రాజధాని భూసమీకరణ పేరిట నెక్కల్లులో సీఆర్డీఏ పర్యవేక్షణలో జరిగిన సర్వేలో అక్రమాలు కోకొల్లలు అనడానికి ఉదాహరణ మచ్చుకు..
ఎవరెవరికి రాసిచ్చేశారంటే..
నెక్కల్లుకు చెందిన రావెల గోపాలకృష్ణ టీడీపీ నాయకుడు. మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్ ముఖ్య అనుచరుడు. ఆయనకు నెక్కల్లు సర్వే నెంబరు 50లో 1.19 ఎకరాలు మాత్రమే ఉంది. దీని ఖాతా నెంబరు 741. కానీ ఈ ఖాతా నెంబరులో 3.11 ఎకరాలు అదనంగా చూపారు. ఈ 3.11 ఎకరాలు తమ భూముల్లో తగ్గించేసి గోపాలకృష్ణ పేరిట చేర్చారని బీసీ వర్గాల ఆరోపణ. ఈ భూమిని 9.14 జీవో కింద పూలింగ్కు ఇచ్చి 4,300 చదరపు గజాలు పొందారు. ఇందులో 8 ప్లాట్లు నివాసం, రెండు ప్లాట్లు కమర్షియల్ కింద లాటరీ ద్వారా దక్కాయి. (సీఆర్డీఏ ప్లాట్ల కేటాయింపు వివరాలు డాక్యుమెంటు 5657/2018 లో స్పష్టంగా ఉంది). ఇందులో అయిదు ప్లాట్లను ఇప్పటికే రావెల విక్రయించేశారు. ఈ భూమికి మూడేళ్లుగా కౌలు కూడా పొందారు.
రావెల అనుచరులు, ఆయన సామాజిక వర్గానికే చెందిన రామినేని మల్లేశ్వరి 1.14 ఎకరాలు, రామినేని సుబ్బారావు– 1.25 ఎకరాలు, రామినేని మురళి– 50 సెంట్లు, కాకా రాఘవయ్య– 1.20 ఎకరాలు, వై.వెంకట్రావు 50 సెంట్లు పొందారు. వెరసి 4.59 ఎకరాల పేదల భూమిని ఓ ప్రధాన సామాజికవర్గానికి చెందిన వారు చేజిక్కించుకున్నారు. కాగా రాఘవయ్య గోపాలకృష్ణకు మేనమామ కావడం గమనార్హం. 9.14 జీవో ద్వారా సీఆర్డీఏ కి పూలింగ్లో ఇచ్చి కౌలు పొందుతున్నారు. ఇవన్నీ పూర్వపు సీఆర్డీఏ రికార్డుల్లో స్పష్టంగా ఉన్నాయి.