వైవీయూ ఉద్యోగిపై టీడీపీ నేత దాడి

16 Sep, 2014 23:01 IST|Sakshi
వైఎస్‌ఆర్‌ జిల్లా: తన సొంత కళాశాలలో లా ఎగ్జామ్స్‌ సెంటర్‌ ఇవ్వలేదని యోగి వేమన విశ్వవిద్యాలయం (వైవీయూ) అసిస్టెంట్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామర్‌ను టీడీపీ నేత గోవర్థన్‌రెడ్డి దుర్భాషలాడిన ఘటన వెలుగులోకి వచ్చింది. 
 
టీడీపీ నేత గోవర్థన్‌రెడ్డి దుష్పవర్తనపై  వైవీయూ రిజిస్ట్రార్‌కు  అసిస్టెంట్‌ కంట్రోలర్‌ ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతపై తగు చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. టీడీపీ నేత వ్యవహారతీరుపై నిరసన వ్యక్తం చేస్తూ యూనివర్శిటీలో విధులను  టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ బహిష్కరించారు. 
మరిన్ని వార్తలు